ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమా తో హీరో గా పరిచయమై టాలీవుడ్ దృష్టి ని ఆకర్షించాడు.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా  ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే..  హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా.. ఓవర్ నైట్ లో చిన్న సినిమాలు చేసే విజయ్ ని స్టార్ హీరో చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. ఈ సినిమా వల్ల ఎక్కువ లాభపడింది నిర్మాత అనేకంటే విజయ్ దేవరకొండ అని చెప్పాలి.. దీనికి విజయ్ పడే కష్టం విజయ్ పడ్డాడు.. అది వేరు విషయం అనుకోండి.. అయితే విజయ్ పై ఇప్పటికి విమర్శలు రావడం అయన అభిమానులకు అస్సలు నచ్చడం లేదు..  ఏదైతేనేం విజయ్ వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ లతో టైర్ 2 హీరోల్లో టాప్ ప్లేస్ ని అయితే సంపాదించుకున్నాడు..

అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ గీత గోవిందం సినిమా తప్పా ఆయనకు ఆ రేంజ్ లో ఏ సినిమా హిట్ రాలేదని చెప్పాలి.. అయన గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా భారీ ఫ్లాప్ ని ఎదుర్కొంది. దాంతో స్టార్ దర్శకులతో తప్పా సినిమాలు చేయనని చెప్పేశాడు విజయ్.. ఆ క్రమంలోనే పూరి జగన్నాధ్ తో సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఈ సినిమా తరువాత సుకుమార్, బోయపాటి శ్రీను లు లైన్ లో ఉన్నారు.. దీంతో తన ఫోకస్ ని మెల్లగా మాస్ సెగ్మెంట్ వైపు మళ్లిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇడియట్ తో రవితేజ, ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ల ఇమేజ్ లు ఏరకంగా అయితే కొత్త మలుపు తిరిగాయో అదే తరహాలో విజయ్ సినిమా ని కూడా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నాడట పూరి. అలాగే ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్ గేమ్ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దే పని సుకుమార్ చేస్తున్నారట... ఊర మాస్ గా అతిశయోక్తితో కూడిన హీరోయిజం చూపించడంలో బోయపాటి స్టైల్ వేరు.   విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ సరిపోయేలా ఉండటంతో ఆ కోణంలో  బోయపాటి సినిమా ఉంటుందట... ఇదే కనక నిజమైతే రౌడీ హీరో ఇకపై మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: