రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా పరాజయం తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు..సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు అని భావిస్తున్నారు.. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ గత కొన్ని రోజులుగా ఇటలీలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజ హెగ్డే, మరికొందరిపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే, అక్కడ హీరో హీరోయిన్లపై కొన్ని పాటలను చిత్రీకరించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ అక్కడ మరికొన్నాళ్ల పాటు కొనసాగుతుంది.ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తాజాగా జస్టిన్ ప్రభాకరన్ ను ఎంచుకున్నారు. తమిళ సంగీత దర్శకుడైన ప్రభాకరన్ ఆమధ్య తెలుగులో 'డియర్ కామ్రేడ్' సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు 'రాధే శ్యామ్' సినిమా అతనికి తెలుగులో మంచి బ్రేక్ అవుతుందనే చెప్పచ్చు

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: