ఇక 'శ్రీనివాస కళ్యాణం' సినిమా తర్వాత గ్యాప్ తీసుకొని నటించిన నితిన్ కి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మూవీగా 'భీష్మ' నిలిచింది. కాకపోతే కరోనా మహమ్మారి వచ్చి దేశవ్యాప్తంగా థియేటర్లు మల్టీప్లెక్సులు మూతబడటంతో ఈ సినిమా లాంగ్ రన్ పై దెబ్బపడింది. దసరా కానుకగా జెమినీ టీవీలో అక్టోబర్ 25న ఫ్యామిలీ అందరూ చూసే విధంగా సాయంత్రం గంటలు 6.30 నిమిషాలకు ప్రసారం చేయనున్నారు.
తాజాగా జెమినీ టీవీలో 'వచ్చేస్తున్నా' అంటూ 'భీష్మ' కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. కితకితలు పెట్టించే కామిడీ సన్నివేశాలు.. అడుగడుగునా పంచ్ డైలాగ్స్.. నితిన్ డ్యాన్సులు ఫైట్స్.. ఇలా వేటికవే ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు అలరించనుంది. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. భారీ తారాగణంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన 'భీష్మ' అక్టోబర్ 25న జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది. మరి బుల్లితెరపైన కూడా మంచి రేటింగ్ తో విజయం సాధించాలని ఆశిద్దాం. అల్ ది బెస్ట్ భీష్మ అండ్ టీం.