హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉందని అనుకుంటున్న టైమ్ లో అనుకోకుండా ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. లాక్ డౌన్ తర్వాత తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది రకుల్. అంతలోనే డ్రగ్స్ కేసులో ఆమెను విచారించేందుకు ఎన్సీబీ నుంచి కబురొచ్చింది. దీంతో ఆమె హడావిడిగా ముంబై బయలుదేరి వెళ్లింది. అప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా మరికొందరు అగ్ర తారల్ని కూడా ఎన్సీబీ విచారించింది. వారిలో రకుల్ కూడా ఒకరు.
ఎన్సీబీ విచారణ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలోనే ఉండిపోయినట్టు సమాచారం. దీంతో ఆమె తెలుగులో చేయాల్సిన సినిమా కూడా డైలమాలో పడింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చే సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా రకుల్ ఒప్పుకుంది. వాటి పరిస్థితి కూడా ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అటు బాలీవుడ్ లో కూడా ఈ భామ ప్రయత్నాలు చేసింది. అక్కడినుంచి కూడా ప్రోగ్రెస్ లేనట్టు తెలుస్తోంది.
మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసు వ్యవహారంతో తీవ్ర ఇబ్బందులు పడినట్టు అర్థమైంది. ఆమెకు ఆ కేసుతో సంబంధం ఉందా లేదా, అనే విషయాన్ని పక్కనపెడితే.. ఆరోపణలు రావడం, ఎన్సీబీ విచారణకు కూడా హాజరు కావడంతో రకుల్ ఇబ్బందులు రెప్టింపయ్యాయి. కొత్త అవకాశాలేవీ రాకపోగా ఉన్న అవకాశాలు తగ్గిపోతాయేమోనని ఆందోళనలో ఉంది రకుల్ ప్రీత్ సింగ్.

ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్న రకుల్.. కొత్త సినిమాల విషయంలో ప్రచారానికి దూరంగా ఉండాలనుకుంటోంది. ఒకవేళ తాను తిరిగి హైదరాబాద్ వచ్చినా, షూటింగ్ లకు హాజరవుతున్నా కూడా.. ఎక్కడా ఎలాంటి ప్రచారం లేకుండా జాగ్రత్త పడాలనుకుంటోంది. అటు సోషల్ మీడియాకి కూడా కొన్నాళ్లుగా రకుల్ దూరంగా ఉంటోంది. మొత్తమ్మీద డ్రగ్స్ కేసు వ్యవహారంతో కాస్త డల్ అయింది రకుల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: