మాటల మాంత్రికుడు త్రివిక్రం  శ్రీనివాస్ పరిస్థితి ఇపుడు బాగా అయోమయంగా ఉందని ఫిల్మ్స్ సర్కిల్స్ లో  ప్రచారం సాగుతోంది. నిజానికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ఇన్నాళ్ళుగా ఖాళీగా ఉండడమే అతి  పెద్ద బాధ. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు అల వైకుంఠ పురంలో మూవీ ద్వారా త్రివిక్రం అల్లు అర్జున్ కలసి మ్యాజిక్ చేశారు. సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ తరువాత ఇక త్రివిక్రం జోరు అలా ఇలా ఉండకూడదు. కానీ ఆయన వెంటనే జూనియర్ ఎన్టీయార్ తో ఒక మూవీ కమిట్ అయ్యారు. అప్పటికి కరోనా లేదు. దాంతో ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈ ఏడాది సమ్మర్ నాటికి కంప్లీట్ అయినా ఆ తరువాత తమ సినిమా ఉంటుందని అంచనా వేసుకున్నారు.

కానీ బొమ్మ తిరగబడింది. వేస్ట్ గా ఏడెనిమిది నెలలు గాలిలో కలసిపోయాయి. ఇపుడు నెమ్మదిగా ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే జూనియర్ ఎన్టీయార్ తన వర్క్ ఫినిష్ చేయడానికి ఎంత కాదనుకున్నా మరో నాలుగైదు నెలలు పడుతుంది అంటున్నారు. ఆ తరువాత కచ్చితంగా త్రివిక్రం మూవీ మొదలెట్టాల్సిందే. కానీ ఈ మధ్యలో గాసిప్స్ కొన్ని వినిపిస్తున్నాయి.

అవేంటి అంటే జూనియర్ ఆర్.ఆర్.ఆర్ మూవీ తరువాత కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కొత్త మూవీ స్టార్ట్ చేస్తారు అని. ఆ మూవీ పాన్ ఇండియా రేంజిలో ఉంటుందంట. అంటే ఆర్.ఆర్.ఆర్ తరువాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీ చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది అని జూనియర్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే కనుక జరిగితే మరో ఏడాది పాటు కచ్చితంగా త్రివిక్రం ఖాళీగా కూర్చోవాల్సివస్తుందని అంటున్నారు. మరి జూనియర్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న త్రివిక్రం విషయంలో జరుగుతుందా అన్నది మరో చర్చ. మొత్తానికి జూనియర్ వేరే మూవీకి కమిట్ అయితే మాత్రం త్రివిక్రం కూడా తన దారి తాను చూసుకుంటాడు అని అంటున్నారట. అయితే ఇదంతా ఒక మామూలు  ప్రచారం. మరి అసలు నిజమేంటో వారిద్దరూ చెబితేనే అందరికీ తెలిసేది.




మరింత సమాచారం తెలుసుకోండి: