ప్రస్తుతం బిగ్ బాస్ 4 తెలుగు లో నోయల్ మంచి పాటలతో, హాస్యం తో బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. చక్కగా బ్రో అంటూ అందరితో కలిసిపోయాడు. మంచిగా నవ్వించే నోయెల్ జీవితం లో బాధలు ఉన్నాయంటే నమ్మలేం. ఇతను ఎస్తర్ ని  ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ  ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లైన కొంత కాలానికే విభేదాలు రావడం తో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎస్తర్ కూడా ఇండస్ట్రీ కి దూరంగా ఉండడం మనం చూస్తున్నాం. ఈమె చివరిగా తెలుగు లో  ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన "జయ జానకి నాయక" అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది.

ఇది ఇలా ఉండగా ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్ లో వచ్చిన "వెయ్యి అబద్ధాలు" అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎస్తర్ పరిచయం అయింది.  ఎస్తర్ ఈ సినిమాతో  గుర్తింపే తెచ్చుకుంది. మంచి నటిగా అలరించి ప్రేక్షకులకి దగ్గర అయ్యింది.  దీని  తర్వాత భీమవరం బుల్లోడు సినిమాలో నటించి మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఎస్తర్. ఎస్తర్ బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమెకి అక్కడ గుర్తింపు రాలేదు. తెలుగు లోనే  ఈమెకి మంచి గుర్తింపు లభించింది. అలానే ఈమె తన కెరీర్ లో రాణిస్తోంది.

ఇది ఇలా ఉండగా నోయెల్ తో ఆమెకి విడాకులు అయిపోయాక  ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి వేడుకలకు ఆమె హాజర్ కావడం లేదు. కాస్త వీటికి దూరం గానే ఉంటోంది ఈ భామ. అప్పటి నుండి  మళ్లీ ఇప్పటి వరకు తెలుగు లో ఈ హీరోయిన్ కనిపించ లేదు. ఎస్తర్ ఇప్పుడు తన కుటుంబ సభ్యుల తో కలిసి మైసూరు లోనే నివాసం ఉంటున్నట్టు తెలుసుతోంది. మరి ఈ అమ్మడు మళ్ళీ ఎప్పుడు తెర మీద కనిపిస్తుంది చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: