సినిమా ప్రమోషన్స్ కూడా క్రేజీగా చేస్తున్నాడు. ఈమధ్యనే భీం ఫర్ రామరాజు అంటూ మన్యం దొర అల్లూరి గురించి ఎన్.టి.ఆర్ వాయిస్ ఓవర్ అదరగొట్టింది. ఇక నేడు ఎన్.టి.ఆర్ కొమరం భీం కోసం రాం చరణ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ముఖ్యంగా వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్.. అంటూ చరణ్ చెప్పిన ఈ వాయిస్ ఓవర్ నందనూరి ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
ఇక కొమరం భీం టీజర్ లో డైలాగ్స్ చూస్తే.. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయ్.. వాడి పొగరు.. ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడి భూతల్లిచ్చిన పాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీం.. అంటూ చరణ్ వాయిస్ ఓవర్.. ఎన్.టి.ఆర్ విజువల్స్ బాక్సాఫీస్ పై చెడుగు ఆడటానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి కొమరం భీం టీజర్ అంచనాలకు మించి అన్నట్టుగా ఉంది. ఆర్.ఆర్.ఆర్ మరో బాహుబలి అంతకుమించి సెన్సేషన్ కానుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.