అయితే బాహుబలి సిరీస్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న జక్కన మరో భారీ కాంబినేషన్ కి తెరలేపాడు. యాంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అనూహ్యంగా ప్రభాస్ రాజమౌళి మధ్య పోటీ నెలకొందని అంటున్నారు. అయితే అది ఎందులోనో అనుకోకండి ప్రమోషన్స్ లో. నిజానికి ఈ ఇద్దరూ పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోరు, కానీ అభిమానుల దెబ్బకు మాత్రం ఇప్పుడు పోటీకి దిగాల్సి వచ్చింది. రాజమౌలో ఆర్.ఆర్.ఆర్ చేస్తుంటే ప్రభాస్ కూడా పాన్ ఇండియన్ మూవీ రాధేశ్యామ్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాని సరిగా ప్రమోట్ చెయ్యట్లేదని ఫ్యాన్స్ తిడుతున్నారు. అందుకే ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది "రాధేశ్యామ్'. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్డేకి మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తమాని అనౌన్స్ చేసింది టీమ్. అలాగే డార్లింగ్ బర్త్డే కంటే రెండు రోజుల ముందే ప్రభాస్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక జక్కన్నది కూడా అదే పరిస్థితి అందుకే అయన కూడా అందరి బర్త్డే లని ప్రమోషన్స్ కి వాడేస్తున్నారు. అలా పోటాపోటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు జక్కన్న అండ్ ప్రభాస్ లు.