మన టాలీవుడ్ లో పూజా హెగ్డే కి ఈ మధ్య కాలంలో కాస్త డిమాండ్ పెరిగింది అనే మాట వాస్తవం. పూజా హెగ్డేతో వరుసగా సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే పూజా హెగ్డే మాత్రం ఎప్పుడూ కొన్ని కొన్ని వివాదాల్లో ఎక్కువగా ఉంటుంది అని ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రధానంగా రెమ్యూనరేషన్ విషయంలో పూజా హెగ్డే ఏ మాత్రం తగ్గటం లేదు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా పరిస్థితి ఉంటే భవిష్యత్తులో అనవసరంగా ఇబ్బందులు వస్తాయని కొంతమంది పూజ హెగ్డే హెచ్చరిస్తున్నా సరే ఆమె మాత్రం మారడం లేదని కొంతమంది మండిపడుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తే పూజా హెగ్డే తెలుగులో చేస్తున్న సినిమాల విషయంలో రెమ్యునరేషన్ ని ఏమాత్రం కూడా తగ్గించడం లేదని దీంతో ఆమెను పక్కన పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల మహేష్ బాబు కూడా పూజ హెగ్డే ని పక్కన పెట్టేసాడని తెలిసింది. ఇక ఇప్పుడు మరో హీరో కూడా పూజ హెగ్డే ని పక్కన పెట్టి నట్టు గా టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఎవరు ఏంటి అనేది ఒకసారి చూస్తే అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లో పూజా హెగ్డే తీసుకోవాలి అని భావించారు.

దువ్వాడ జగన్నాథం అదేవిధంగా అల వైకుంఠపురములో సినిమాలో పూజ హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఈ సినిమాలో ఆమె తీసుకునే విధంగా ప్లాన్ చేశారు. కానీ పూజ హెగ్డే మాత్రం దాదాపుగా 7 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో వెనక్కు తగ్గింది చిత్ర యూనిట్. ఆమెను కాదని మరో హీరోయిన్ ని ఎంపిక చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: