తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు స్టార్ హీరో లను ఎంపిక చేసి తెలంగాణలో ఐటి రంగానికి సంబంధించి ప్రచారం చేయించే అవకాశాలు ఉన్నాయని గతకొన్ని రోజులుగా వార్తలు చూస్తూనే ఉన్నాం. నిజం ఏంటి అనేది తెలియదు కాని దీనికి సంబంధించి మాత్రం త్వరలోనే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ల ను కూడా హైదరాబాదులో ప్రచారానికి వాడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రధానంగా ఐటీ రంగం విషయంలో మంత్రి కేటీఆర్ చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికి కీర్తి సురేష్ ని ఎంపిక చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పూజా హెగ్డే ని కూడా ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించి చేసే ప్రచారంలో వాడుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలతో సంప్రదించింది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగులు కూడా మొదలయ్యే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు పెట్టే విషయంలో భయపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కి లో ఉన్న భయాన్ని పోగొట్టే విధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మంత్రి కేటీఆర్ ఇప్పటికే సమాచార శాఖతో కూడా సమావేశమై దీనికి సంబంధించి కొంత మంది దర్శకులతో కూడా చర్చించే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఆ దర్శకుడు ఎవరు ఏంటి అనేది మాత్రం త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వరదలు తగ్గిన తర్వాత క్షేత్ర స్థాయిలో స్టార్ హీరోలను కూడా తీసుకుని వెళ్లి అంతా నార్మల్ అయింది అని చూపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గత రోజులుగా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: