టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా అనగానే చాలా మంది నటించడానికి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే గత కొంత కాలంగా మహేష్ బాబు సినిమా లో కొంతమంది నటుల విషయంలో మాత్రం ఇబ్బంది ఎదురవుతుంది. కరోనా సమయంలో కూడా కొంతమంది ఆయన సినిమాల్లో నటించే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మహేష్ బాబు సినిమాలో ఖర్చు తక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆయన సినిమాల్లో నటించడానికి వెనకడుగు వేస్తున్నారు.

ఇటీవల మహేష్ బాబు సినిమాలో నటించడానికి జగపతిబాబుని నటించాలి అని సంప్రదించారని వార్తలు ఎక్కువగా వచ్చాయి. అయితే విలన్ పాత్రలో జగపతిబాబు నో చెప్పారని కూడా టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాలో ఆయనకు చాలా తక్కువగా రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. దీనితో ఆయన ఈ సినిమాలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనితో ఒక తమిళ హీరోని తీసుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తమిళ హీరో కూడా మరి పారితోషికం తక్కువగా ఉండటంతో నో చెప్పాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని దాదాపుగా ఎంపిక చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన ఒకటి వెలువడనుంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో కూడా స్పష్టత రావడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. రెండో హీరోయిన్ ఎవరు ఏంటి అనేది దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇక ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో రమ్యకృష్ణ నటించే అవకాశం ఉండవచ్చు అని టాలీవుడ్ జనాల మాట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: