తొలిసారిగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పెట్టాడు కొరటాల శివ. కొన్నేళ్ళ క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని తొలి సినిమాతోనే దర్శకుడిగా శివ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా తీసి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన కొరటాల శివ, అనంతరం  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఆపై మరొకసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా తీసి మరో హిట్ ను అందుకున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో లేటెస్ట్ గా తీస్తున్న సినిమా ఆచార్య. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండగా దీనిని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తోంది యూనిట్. ఇక దీని తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్న కొరటాల శివ, ఆపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కూడా ఒక సినిమా చేయనున్నారంటూ ఇటీవల కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్, దాని అనంతరం వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయనున్నారని, అందువలన కొరటాల శివ చరణ్ కంటే ముందు నటసింహం బాలకృష్ణ తో ఒక సినిమా చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ ని సిద్ధం చేసిన కొరటాల శివ అతిత్వరలో ఆయన్ని కలిసి దానిని వినిపించనున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలయ్యే ఛాన్స్ ఉందని టాక్.మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: