టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా మూవీ. వకీల్ సాబ్ లో లాయర్ గా నటిస్తున్న పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాలో ఒక వజ్రాల దొంగ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే వకీల్ సాబ్ ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా అతి త్వరలో లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది.
అంజలి, నివేద థామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తుండగా దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అది త్వరలో రిలీజ్ కాబోతుంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి తీసుకువచ్చేలా కొద్ది రోజులుగా యూనిట్ ప్లాన్ చేస్తోందని కూడా ఒక వార్త ప్రచారం అవుతోంది.
అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా రాబోయే సంక్రాంతి బరి నుండి తప్పుతుంది అని సమాచారం. దానికి కారణం ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ కు మరికొంత సమయం పట్టనుందని, ప్రస్తుతం మన రాష్ట్రంలో కరోనా కేసులు మరింత ఎక్కువగా ఉండటంతో షూటింగ్ వాయిదా వేశారని ఆ కారణంగానే సినిమా రిలీజ్ కూడా వాయిదా పడటం జరిగిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: