అయితే, ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ఈ సినిమాకి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో ఓ కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు, ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్టు కూడా చెబుతున్నారు.
ఆమె ఒప్పుకుందనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేశారట. అంటే ఈ సినిమాలో సమంతా జాన్వీ కపూర్ లు ఇద్దరూ కలిసి నటిస్తున్నట్టు చెబుతున్నారు. అంటే ఇది కూడా మల్టీ స్టారర్ ఏ మరి. .ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు. నిజానికి పూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం జాన్వీని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అనన్య పాండేను ఫైనల్ చేశారు.