నందమూరి వారసుడు ఎన్టీఆర్ వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అయినా సరే మనోడు ముందు జాగ్రత్తగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో అరవింద సమేత లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో ఈసారి ఎలాంటి పెద్ద హిట్ కొడతారో ? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే, ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ఈ సినిమాకి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో ఓ కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు, ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్టు కూడా చెబుతున్నారు.

ఆమె ఒప్పుకుందనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేశారట. అంటే ఈ సినిమాలో సమంతా జాన్వీ కపూర్ లు ఇద్దరూ కలిసి నటిస్తున్నట్టు చెబుతున్నారు. అంటే ఇది కూడా మల్టీ స్టారర్ ఏ మరి. .ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు. నిజానికి పూరి-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం  జాన్వీని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అనన్య పాండేను ఫైనల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: