కట్ చేస్తే లేటెస్ట్ గా రష్మికి కరోనా పాజిటివ్ వచ్చిందని టాక్. సుధీర్, రష్మిలకు కరోనా పాజిటివ్ అనగానే ఢీ, జబర్దస్త్ బ్యాచ్ అంతా కంగారు పడుతున్నారు. వీరిద్దరికి కరోనా అంటే తప్పకుండా ఆ రెండు షోల టీం లలో ఎవరికో ఒకరికి కరోనా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. సుధీర్ వెంటే తానెప్పుడూ అంటూ కరోనా విషయంలో కూడా ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నారు.
ప్రస్తుతం సుధీర్ హోం క్వారెంటైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ దసరా ఎపిసోడ్స్ లో సుధీర్, రష్మిల హంగామా అదిరిపోయింది. మరి ఈ స్పెషల్ ఎపిసోడ్స్ లో ఉన్న వారు కూడా వీరిద్దరికి కరోనా అని తెలియగానే టెస్టులు చేయించుకోవడం బెటర్ అని భావిస్తున్నారు. అయితే ఇలా చేసి టీం లో సగం మందికి కరోనా వస్తే మాత్రం ఢీ, జబర్దస్త్ షోలు కొన్ని వారాలు బ్రేక్ ఇవ్వక తప్పదని టాక్.