మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తుండగా ఆయన సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. దేవాలయాల భూములు కుంభకోణాల నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే యాబై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది.

ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మూవీ యూనిట్ సభ్యులు. ఇక దీని అనంతరం ఇటీవల మలయాళంలో మంచి సక్సెస్ కొట్టిన లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు వినాయక ఇప్పటికే పలు మార్పులు చేర్పులు చేశారని అలాగే అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. ఒక స్టార్ హీరోయిన్ మెగాస్టార్ కు జోడిగా నటించనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది.

దాన్ని బట్టి ఈ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ఇద్దరు హాలీవుడ్ కి చెందిన బడా ఫైట్ మాస్టర్స్ ని తీసుకొనుందట మూవీ యూనిట్. ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిపిన దర్శకనిర్మాతలు అతి త్వరలో వారిని టాలీవుడ్ కు తీసుకువచ్చి సినిమా షూటింగ్ లో ప్రవేశపెట్టనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం ఇది మెగా ఫ్యాన్స్ కు పెద్ద పండుగ వార్త అని చెప్పకతప్పదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: