ఇకపోతే దీని అనంతరం క్రియేటివ్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను రెడీ చేసుకున్న సుకుమార్, దీనిని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ హంగులు కలగలిపి తెరకెక్కించనున్నాడట. గతంలో రామ్ చరణ్ తో రంగస్థలం వంటి భారీ సక్సెస్ఫుల్ మూవీ తీసిన సుకుమార్, ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.
అది పూర్తయిన అనంతరం విజయ్ దేవరకొండ సినిమా మొదలు పెడతారని అలానే ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక ను ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. ఇటీవల రష్మికకు ఈ సినిమా కథ, కథనాలు వినిపించి మాట్లాడిన సుకుమార్, ఆమె నుండి ఆమోదం కూడా తీసుకున్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో పట్టాలెక్కనుందని సమాచారం.
గతంలో వీరిద్దరి కలయికలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక నిజమైతే మాత్రం ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ, రష్మిక ల కలయికలో మరొక సినిమా చూడవచ్చు.....!!