టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమానే RRR. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అల్లూరిగా, చెర్రీ... కొమురం భీంగా తారక్ నటిస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాకి ఇటీవల రిలీజ్ అయిన అల్లూరి, కొమురం భీం వీడియోలు మరింత హైప్ ని తీసుకొచ్చాయి. చరిత్ర ప్రకారం తెలంగాణకు చెందిన విప్లవవీరుడు కొమురం భీమ్ మరియు ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఎప్పుడూ ఒకరినొకరు కలుసుకోలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి వీరిద్దరినీ ఒకచోట చేర్చి స్టోరీ చెప్పబోతున్నాడు.

నిజానికి రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని.. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ కొన్ని రోజులు కనిపించకుండా పోయిన పీరియడ్ లో ఇద్దరూ కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే ఐడియా ఇదని.. దేశభక్తి కంటే వారి మధ్య ఉండే స్నేహం గురించి ప్రధానంగా చెప్పబోతున్నానని చెప్పుకుంటూ వచ్చాడు. అందులోనూ 'భీమ్ ఫర్ రామరాజు'లో చరణ్ ని పోలీసుగా చూపించిన రాజమౌళి.. 'రామరాజు ఫర్ భీమ్' వీడియోలో తారక్ ని ఒక ముస్లిమ్ యువకుడిగా చూపించాడు. ఇద్దరినీ యుద్ధవీరులుగా చూపిస్తూ రామరాజు - భీమ్ సోదరభావంతో మెలుగుతుంటారనే విషయాన్ని టీజర్స్ తో వెల్లడించారు.అంతేకాకుండా చరణ్ ని నిప్పుల్లో చూపించిన రాజమౌళి.. ఎన్టీఆర్ ని నీళ్లలో చూపించాడు.

రెండు వీడియోలలో ప్రతి ఫ్రేమ్ లో నీటికి నిప్పుకి ప్రతీకగా నిలిచే షాట్స్ తో వేరియేషన్ చూపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కూడా ఈ తేడా స్పష్టంగా కనిపించేలా డిజైన్ చూపించాడు. దీంతో ఎవరూ ఊహించనిది తెరపై చూపించే జక్కన్న ఈసారి ఏం చెప్పబోతున్నాడో అని అందరికి ఆత్రుత మొదలైంది. ఏదేమైనా స్టోరీ టెల్లింగ్ లో మాస్టర్ అనిపించుకున్న రాజమౌళి.. 'ఆర్.ఆర్.ఆర్' లో కూడా అందరిని మెప్పించే విధంగా తెరపై ప్రెజెంట్ చేయబోతున్నాడనేది మాత్రం స్పష్టం అయింది.మరి rrr తో మన జక్కన్న ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: