హీరో నితిన్, మహానటి కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న మొదటి సినిమా రంగ్ దే. హారికా హాసినీ వారి సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు తెరకెక్కించి ఫీల్ గుడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అన్ని సినిమాల లాగానే ఈ సినిమా కూడా కరోనా వైరస్ వలన విధించిన లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ కొన్ని నెలలుగా ఆగిపోయింది.

అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొన్ననే హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. ఇక ఇదే సినిమా షూటింగ్ ఇటలీలో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇటలీ లో కొన్ని సాంగ్స్ , సీన్స్ చిత్రీకరణకై చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అక్టోబర్ 25 వ తేదీ ఇటలీ కి చిత్ర యూనిట్ బయలుదేరనుందని అంటున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఇటలీలో ఈ సినిమా షూట్ ఒక క్వారెంటైన్ బబుల్ లో చేయనున్నారట. ఇప్పటికే ఈ  పద్దతిని ఐపీఎల్ కోసం వాడుతున్నారు. ఇప్పుడు అదే పద్దతిని ఈ సినిమా కోసం వాడనున్నట్టు చెబుతున్నారు. ఇటలీకి వెళ్ళే ముందు కోవిడ్ టెస్ట్ లు చేయించుకుని వెళ్లనున్నట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: