టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో రాజశేఖర్ ఒకరు.అప్పట్లో ఆయన చాలా సినిమాల్లో నటించి,యాంగ్రీ యంగ్ మెన్ అనే ట్యాగ్ లైన్ ని సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో రాజశేఖర్ సినిమాలన్నీ దాదాపు యాక్షన్ ఎంటర్టైనర్స్ కావడం... ఎక్కువ సీరియస్ రోల్స్ లో నటించడం తో ప్రేక్షకులు ఆయన్ని యాంగ్రీ యంగ్ మెన్ అని పిలుస్తూ ఉంటారు.ఇదిలా ఉంటె ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. దానితో ఆయన ఆరోగ్యం పట్ల వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఇందులో భాగంగా  రాజశేఖర్ ఆరోగ్యం పై ఆయన  కూతురు శివాత్మిక సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేశారు.

 కరోనా వైరస్ తో పోరాడుతున్నారు అని, మీ ప్రార్థన మరియు శుభాకాంక్షలు కావాలి అని ఒక ట్వీట్ లో కోరగా, మరొక ట్వీట్ లో ఆరోగ్యం నిలకడగానే ఉంది అని, మీ విషమం గా లేదు అని, మీ ప్రార్థనలు మరియు పాజిటివీటి కావాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ విషయం ఎల్ ఎటువంటి అసత్యాలు ప్రచారం చేయొద్దు అంటూ అభిమానులను వేడుకున్నారు. అయితే నటుడు రాజశేఖర్ ఆరోగ్యం పై చిరంజీవి స్పందించారు.ఇండ్రస్టీ లో ఉన్న సీనియర్ హీరోలుగా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే తన తోటి సీనియర్ హీరో, మరియు తన స్నేహితుడైన రాజశేఖర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఇటీవల చిరు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
 
ఇక తాజాగాశివాత్మిక చేసిన ట్వీట్ పై చిరు స్పందిస్తూ, డియర్ శ శివాత్మిక, మీ ప్రియమైన నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా, ధైర్యంగా ఉండండి, అందరి ప్రార్థనలతో త్వరగా కోలుకుంటారు, మీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా అని చిరు పేర్కొన్నారు.చిరు చేసిన ట్వీట్ కు అభిమానులు సైతం స్పందిస్తున్నారు. మేము కూడా రాజశేఖర్ ఆరోగ్యం కోసం ప్రార్దిస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం చిరూ చేసిన ఈ ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: