బిగ్ బాస్ ఏడవవారంలోకి ప్రవేశించింది. రేపూ ఎల్లుండి వీకెండ్ ధమాకా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఓ వైపు చూస్తే దసరా సంబరాల హడావుడి కూడా ఉంది. మరో వైపు బిగ్ బాస్ మంచి టైమింగ్ తో ముందుకు సాగుతోంది. వీకెండ్ అనగానే అందరికీ ఇంటరెస్ట్ పెంచేది ఎలిమినేషన్ రౌండ్. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని మీద ఆడియన్స్  బుర్రలు బద్ధలు కొట్టుకుంటారు. అయితే ఏడవవారం బిగ్ బాస్ హౌజ్ లో ఆరుగురు నామినేట్ అయ్యారు.

వారే నోయల్, అరియానా, దివి, మోనాల్, అభిజిత్, అవినాష్. ఇప్పటిదాకా చూసుకుంటే మోనాల్ డేంజర్ జోన్ లో ఉంది అని అంటున్నారు. ఎలిమినేషన్ రౌండ్ ఉంటే కనుక ఆమె పెట్టే బేడా సర్దాల్సిందే. కానీ ఈ వారం అసలు ఎలిమినేషనే లేదు అనేస్తున్నారు. దానికి కారణం నాగార్జున హోస్ట్ చేయడం లేదు. అక్కినేని కోడలు సమంత ఈ వారం ప్రత్యేక అతిథిగా వస్తారని అంటున్నారు. ఆమె కనుక  వస్తే రెండు రోజుల పాటు బిగ్ బాస్ షోలో  సందడి ఉంటుంది.

హౌజ్ మెంబర్స్ కి కొన్ని టాస్కులు, గేమ్స్  ఇచ్చి ఆడిస్తారు. వారిలో జోష్ పెంచుతారు. కానీ ఆమె ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టదు అంటున్నారు. గతంలో కూడా సీజన్ 3 లో నాగార్జునకు బదులుగా రమ్యక్రిష్ణ వచ్చింది. ఆమె ఆ వారంలో కూడా ఎలిమినేషన్ ఏదీ లేకుండానే ముగించేశారు. దాంతో ఇపుడు సమత కూడా అదే చేస్తారని అంటున్నారు. అది కనుక జరిగితే హౌజ్ లోని మెంబర్స్ అంతా ఊపిరి పీల్చుకున్నట్లే. మొత్తానికి వీకెండ్ ఎలా ఉంటుందో అన్న ఆత్రుత మాత్రం అటు హౌజ్ మెంబర్స్ కే కాదు, ఇటు ఆడియన్స్ కి కూడా కలుగుతోంది. ఏది ఏమైనా సమత కనుక ఈసారి హోస్ట్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని కూడా అంటున్నారు. మరి బిగ్ బాస్ ఆమెను తీసుకువస్తున్నారా. లేక వేరే ఎవరైనా వస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: