ఇక అసలు వివరాల్లోకి వెళితే.. కియారా అద్వాని. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు "భరత్ అనే నేను" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో "వినయ విధేయ రామ" అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. మళ్లీ ఇంతవరకు తెలుగు సినిమా చేయలేదు.
ఇదిలా ఉంటే.. సాధారణంగా ప్రేమ, పెళ్లి విషయాల గురించి మన కథానాయికల్ని ప్రశ్నించినప్పుడు చాలా మంది తెలివిగా సమాధానాల్ని దాటవేసే ప్రయత్నాలు చేస్తుంటారు. పంజాబీ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ మాత్రం ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నేహాధూపియా నిర్వహిస్తున్న 'నో ఫిల్టర్ నేహా' అనే టాక్షోలో పాల్గొంది. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమ వ్యవహారం గురించి కియారా అద్వాణీని అడగ్గా..."నేను ఏ విషయాన్ని దాచిపెట్టను. సిద్ధార్థ మల్హోత్రా నాకు ఆత్మీయ స్నేహితుడు. మా ఇద్దరి మధ్య అంతకుమించి ఏ సంబంధం లేదు. ప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నా. పెళ్లయ్యేంతవరకు ఒంటరిగానే ఉంటా" అంటూ కాస్త వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ప్రేమ విషయంలో తనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయని, ఇండస్ట్రీ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. "ఏడాదిలో ఎక్కువ సమయం ఇండస్ట్రీలోనే గడుపుతాం కాబట్టి పరిచయాలు ఏ బంధానికి దారితీస్తాయో చెప్పలేం. నా మనసుకు నచ్చిన వాడు తారసపడితే తప్పకుండా ఇండస్ట్రీ వ్యక్తినే పెళ్లాడుతా" అని కియారా అద్వాణీ స్పష్టం చేసింది.