కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫాంలో ఉంది. వరుస స్టార్ సినిమాలతో సత్తా చాటుతున్న అమ్మడు ఈ ఇయర్ సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకున్న రష్మిక త్రివిక్రం, ఎన్.టి.ఆర్ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న అమ్మడు తన ప్రతి అప్డేట్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రాం లో రష్మిక పెట్టిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీతాకోకచిలుక రెక్కల మధ్య నిలబడి ఫోటోకి స్టిల్ ఇచ్చిన రష్మిక నన్ను మీరు నిజంగా ప్రేమిస్తున్నట్ట్లైతే నా రెక్కలు కత్తిరించకండి అంటూ కామెంట్ పెట్టింది. ఇంతకీ రష్మిక ఆ మెసేజ్ పెట్టడానికి గల కారణాలు ఏంటన్నది తెలియట్లేదు. తనని కామెంట్స్ రూపంలో ఎవరైనా టార్గెట్ చేశారా.. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై కొందరు ఆకతాయిలు ట్రోల్స్ చేయడం కామనే. ఆ క్రమంలోనే రష్మికని కూడా టార్గెట్ చేశారా అందుకే ఆమె అలా కామెంట్ పెట్టిందా అన్నది తెలియాల్సి ఉంది.

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఆ తర్వాత దేవదాస్ సినిమా ఆడకపోయినా రష్మికకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఫైనల్ గా అమ్మడు స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. రానున్న రోజుల్లో రష్మిక తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా రష్మిక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. కోలీవుడ్ లో కార్తీ హీరోగా సుల్తాన్ సినిమాలో నటిస్తుంది రష్మిక.                          



మరింత సమాచారం తెలుసుకోండి: