హీరో రాజశేఖర్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తనకు మరియు కుటుంబానికి కరోనా సోకినట్లు తెలియజేశారు. భార్య జీవితా మరియు కూతుళ్లు శివాని, శివాత్మికలు కూడా కరోనా బారిన పడ్డట్లు ఆయన చెప్పడం జరిగింది. ఇద్దరు అమ్మాయిల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్న రాజశేఖర్...హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అప్పటి నుండి రాజశేఖర్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కోవిడ్ కి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ తొందరగా కోలుకోవాలని ప్రార్తించమని కోరింది.
ఈ నేపథ్యంలో శివాత్మిక ట్వీట్‌పై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. రాజశేఖర్‌ త్వరగా కోలుకొవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. "ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న, నా సహా నటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ధైర్యంగా ఉండు" అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఇక రాజశేఖర్‌ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రి సిబ్బంది హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనరాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌లో ఉన్నప్పటికీ వైద్యానికి హీరో రాజశేఖర్‌ స్పందిస్తున్నారని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ట్విట్టర్‌ ద్వారా విలక్షణ నటుడు మోహన్‌బాబు స్పందిస్తూ.. "నా సహచరుడు, ప్రియమైన స్నేహితుడు రాజశేఖర్‌, జీవిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. సాయిబాబా దయతో వారు త్వరగా కోలుకుంటారని, కచ్చితంగా సినిమా షూటింగుల్లో పాల్గొంటారని ఆశిస్తున్నా" అని ట్వీట్‌ చేశారు. మనం కూడా హీరో రాజశేఖర్ గారు త్వరగా కోలుకోని ఎప్పటిలాగే మనల్ని ఎంటర్ టైన్ చేయాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: