బాహుబలి తో అయన పేరు ఎంతలా వెలిగిపోయిందో ప్రేత్యకంగా చెప్పనవసరం లేదు.. టాలీవుడ్ పేరు ను దేశమంతటా వినిపించిన ఘనత ఆయనది..బాలీవుడ్ లో రాజమౌళికి బ్రహ్మరథం పట్టారు.. అక్కడి హీరో లు కూడా తమ సినిమా చేయాలి అని కోరారు. కానీ రాజమౌళి టాలీవుడ్ హీరో లు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లతో పవర్ ఫుల్ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు.. ఇప్పటివరకు ఇలాంటి స్టార్స్ ని పెట్టి ఏ దర్శకుడు టాలీవుడ్ లో సినిమా చేయలేదు.. స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమా ల ట్రెండ్ ను రాజమౌళి మొదలుపెట్టారని చెప్పాలి..
ఇక ఈ సినిమా నుంచి రామ్ చరణ్ తేజ్ టీజర్ ని రిలీజ్ చేశాడు రాజమౌళి.. అల్లూరి సీతారామ రాజు గా ఆ టీజర్ లో మెగా ఫాన్స్ ని ఉర్రుతలూగించే అంశాలు ఎన్నో ఉన్నాయి..ఎన్టీఆర్ కొమురంభీం టీజర్ ని రిలీజ్ చేశారు.. ఈ టీజర్ అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది.. మొత్తానికి ఈ భారీ విజువల్ వండర్ కు సంబంధించి రెండు పాత్రల పరిచయాలు జరిగిపోయాయి. ఒకరు అల్లూరి సీతారామరాజు మరొకరు కొమురం భీం. వేర్వేరు ప్రాంతాలు, కాలాలకు చెందినవాళ్లు.ఇది వాస్తవ కథ కానప్పటికీ ఈ ఇద్దరూ యోధులు కలిసి స్వాతంత్రం కోసం సమరం చేస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద కథకులు విజయేంద్ర ప్రసాద్ దీన్ని తీర్చిదిద్దినట్టు టాక్.నా తమ్ముడు భీం అని రామరాజు చెప్పడం చూస్తుంటే కథలో ఇద్దరిని అన్నదమ్ములుగా చూపించినా ఆశ్చర్యం లేదు. అనిపిస్తుంది. మరి ఈ స్టోరీ ఏంటో తెలియాలంటే రిలీజ్ అయ్యే దాకా వెయిట్ చేయక తప్పదన్నమాట..