విక్టరీ వెంకటేష్ చేయాల్సిన ఓ సినిమా ఇప్పుడు యువ హీరో శర్వానంద్ చేతికి వచ్చింది. కొన్నాళ్ళుగా డిస్కషన్స్ లో ఉన్న ఈ సినిమా ఫైనల్ గా సెట్స్ మీదకు వెళ్ళబోతుందని తెలుస్తుంది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వెంకటేష్ హీరోగా ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా చర్చల్లో ఉంది. అయితే ఆ సినిమా మీద ఎందుకో వెంకీ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ లోకి శర్వానంద్ వచ్చాడు.

శర్వానంద్, కిశోర్ తిరుమల కాంబోలో ఈ సినిమా వస్తుంది. సినిమాకు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ లో సుధాకర్ చ్రుకూరి నిర్మిస్తున్నారు. సినిమాను దసరా సందర్భంగా తిరుపతిలో మొదలుపెడుతున్నారని తెలుస్తుంది. ఆడాళ్ల గొప్పతనం తెలిపేలా ఈ సినిమా కథ కథనాలు ఉంటాయట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది ఇంకా నిర్ణయించలేదు.

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి సినిమాతో సత్తా చాటిన కిశోర్ తిరుమల రాం తో రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. కిశోర్ తిరుమల, శర్వానంద్ ఇద్దరు కలిసి చేస్తున్న మొదటి సినిమాగా ఆడాళ్లూ మీకు జోహార్లు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. వెంకటేష్సినిమా కాదనడానికి కారణాలు ఏమైగాని శర్వానంద్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు. తప్పకుండా ఈ సినిమా అతని కెరియర్ లో స్పెషల్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు.                                                                 



మరింత సమాచారం తెలుసుకోండి: