శర్వానంద్, కిశోర్ తిరుమల కాంబోలో ఈ సినిమా వస్తుంది. సినిమాకు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ లో సుధాకర్ చ్రుకూరి నిర్మిస్తున్నారు. సినిమాను దసరా సందర్భంగా తిరుపతిలో మొదలుపెడుతున్నారని తెలుస్తుంది. ఆడాళ్ల గొప్పతనం తెలిపేలా ఈ సినిమా కథ కథనాలు ఉంటాయట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది ఇంకా నిర్ణయించలేదు.
నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి సినిమాతో సత్తా చాటిన కిశోర్ తిరుమల రాం తో రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. కిశోర్ తిరుమల, శర్వానంద్ ఇద్దరు కలిసి చేస్తున్న మొదటి సినిమాగా ఆడాళ్లూ మీకు జోహార్లు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. వెంకటేష్ ఈ సినిమా కాదనడానికి కారణాలు ఏమైగాని శర్వానంద్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు. తప్పకుండా ఈ సినిమా అతని కెరియర్ లో స్పెషల్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు.