టాలీవుడ్ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు అని చెప్పుకోవచ్చు. అయితే తే నా రాజకీయం లోకి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆయన ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు అయితే గత ఎలక్షన్లో ఆయన ఓడిపోవడం మళ్లీ ఆయన సినిమాల వైపు చూడటం ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పింది. వఖీల్ సాబ్ సినిమాను దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రకటించినప్పుడు ఫాన్స్ చేసిన హంగామా తెలిసిందే. అయితే ఈ సినిమాను ఈ సమ్మర్ కి విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా ఆగిపోయింది. ఎన్నో రోజులు సినిమా షూటింగ్ లకు విరామం వచ్చింది అయితే కేంద్రం ప్రకటించిన అన్లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు మళ్లీ ప్రారంభం అయ్యాయి. సీనియర్ హీరోలను మినహాయిస్తే మిగిలిన వారు దాదాపుగా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి వకీల్‌ సాబ్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ మూవీ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే వార్త ఫిలింనగర్లో వినిపిస్తోంది. అదేంటంటే ఈ మూవీ టీజర్‌ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.పవన్‌కు సంబంధించి ఇంకా 15 రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమా విషయానికి వస్తే బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన పింక్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కూడా నటించనున్నారు. నాగెళ్ల, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత అలాగే రాజకీయ పరాజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది మరి ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: