సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో చేయనున్న సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీయనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇప్పటికే గీతా గోవిందం సినిమా సక్సెస్ తో పరశురామ్, అలానే వరుసగా మూడు సక్సెస్ లు అందుకున్న మహేష్ బాబు ఇద్దరూ కూడా మంచి జోష్ మీద ఉండడంతో తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కీర్తి సురేష్ తొలిసారిగా సూపర్ స్టార్ కు జోడిగా ఈ సినిమాలో నటిస్తోంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికాలో జరుగనుంది. ఇకపోతే దీని తరువాత దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్నారు మహేష్ బాబు. కాగా ఆ సినిమాని కేఎల్ నారాయణ తన దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనుడగా, ఆపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు మహేష్. ఇక మరోవైపు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్న వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ, అది పూర్తి అయిన అనంతరం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవల మహేష్ బాబు కోసం కూడా ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేసిన శివ, కొద్దిరోజుల క్రితం ఆయనను కలిసి కథ విన్పించడం జరిగిందని, గతంలో తనతో శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ సినిమాల రేంజ్ లోనే ఈ సినిమా కథ కూడా ఉండడంతో మహేష్ కూడా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. అయితే మహేష్ ఇప్పటికే ఒప్పుకున్న కమిట్మెంట్స్ అనంతరం ఈ సినిమా చేస్తారా, లేక ఈలోపే కొరటాల శివ సినిమా మొదలెడతారా అనే దానిపై త్వరలో స్పష్టత రానున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలంటే మాత్రం దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: