ప్రస్తుతం సినీ రంగంలో థ్రిల్లర్ మరియు సస్పెన్స్  కథ నేపధ్యం కలిగిన మూవీల హవా సాగుతోంది.. బిగ్ సెలబ్రిటీలు అందరూ ఈ తరహా సినిమాలకే ఎక్కువగా ఓటేస్తున్నారు.. అటు ప్రేక్షకుల్లో కూడా ఇటువంటి కథలను బాగా ఆదరిస్తుండడం తో డైరెక్టర్లు కూడా ఎక్కువగా థ్రిల్లర్ మూవీ కాన్సెప్ట్ నే తీసుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ సహా అన్ని ఓటీటీలు థ్రిల్లర్ సిరీస్ లతో అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

అయితే ఈ తరహా బంపర్ ఆఫర్ ఒకటి నిత్య మీనన్ ముంగిట వాలి ఉందని సమాచారం. గతంలో నిత్యామీనన్ , అభిషేక్ బచ్చన్ నటించిన ‘బ్రీత్: ఇంటు ది షాడోస్’ హిందీ వెబ్ సిరీస్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే... కాగా ఇప్పుడు అదే రూట్ లో మరో మూవీ ఆఫర్ రావడంతో నిత్య మీనన్ చేద్దామని ఆలోచనలోనే ఉన్నారట. ఈ చిత్రానికి దర్శకుడు అవసరాల శ్రీనివాస్ భారీ బడ్జెట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాలని నిత్యా మీనన్ ని సంప్రదించారట.. థ్రిల్లర్ చిత్రాల గెలుపు రుచి చూసిన నిత్య మీనన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అసలే కొత్త తరహా చిత్రాలకు ఎక్కువగా ఓటేసే ఈ అమ్మడు అంత ఈజీగా ఈ చాన్స్ ను వదులుకోకుండా కచ్చితంగా చేస్తుందని ఆమె అభిమానులు అభిప్రాయ పడుతున్నారు....

 అయితే ఇప్పుడు నిత్యాని ఎంపిక చేసారా లేదా? అన్నది అధికారికంగా అవసరాల శ్రీనివాస్ ప్రకటించాల్సి ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కి వీలైనంత త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని మన ముందుకు రానుంది అట.... మరి ఈ చిత్రం గురించి మనకు పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ వెబ్ సిరీసును ప్రముఖ నిర్మాణ సంస్థ వ్యజయంతి మూవీస్ నిర్మిస్తుండడంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: