టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆచార్య. వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ దీనికి దర్శకుడు. గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి అనే భారీ ప్రతిష్టాత్మక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి దానితో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు. కనుక ఇక ప్రస్తుతం కొరటాల తో చేస్తున్న ఆచార్యతో ఎలాగైనా భారీ సక్సెస్ కొట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నారు మెగాస్టార్. దేవాలయాల భూములు, మోసాల నేపథ్యంలో మంచి మేసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకడు శివ ఈ సినిమాని తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా భారీ స్థాయిలో స్పందన లభించింది. ఇకపోతే ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారని, అలానే అతి త్వరలో ప్రారంభం కాబోయే షెడ్యూల్ లో ఆయన జాయిన్ కానున్నారని అంటున్నారు. ఇక అతి త్వరలో ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కానుంది అనేటువంటి వార్త కూడా ప్రచారం అవుతోంది.

మొత్తంగా మెగాస్టార్ నటిస్తున్న ఈ ఆచార్య సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల పై అతి త్వరలో దర్శకుడు కొరటాల శివతో కలిసి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇస్తారని అంటున్నారు. ముఖ్యంగా సినిమా ఎంతవరకు కంప్లీట్ అయింది, చరణ్ అసలు ఈ సినిమాలో ఉన్నారా లేదా, టీజర్ తో పాటు సినిమా పక్కాగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయాలు అన్ని కూడా ఆయన చెపుతారట. కాగా అప్పటివరకు తమ సినిమాకు సంబంధించి ప్రచారం అయ్యే ఎటువంటి వార్తలను నమ్మవద్దని అంటున్నారు. దీనితో ఆచార్య కు సంబంధించి ప్రచారం అవుతున్న వార్తలకు చాలావరకు అడ్డుకట్ట పడిందని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: