టాలీవుడ్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా ప్రత్యేకం.. బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సాహోతో పర్వాలేదు అనిపించాడు. రాధే శ్యాం తో మరోసారి తన సత్తా చాటనున్నాడు. రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా క్రేజీగా రాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా దీపిక పదుకొనె స్పెషల్ విషెస్ తెలిపింది.

తన ఇన్ స్టాగ్రాం లో ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది దీపిక. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉన్|డాలని ఆశిస్తున్నా అంటూ దీపిక స్పెషల్ కామెంట్ పెట్టింది. ప్రభాస్ ఫోటో పెట్టి మరి దీపికా ఈ స్పెషల్ బర్త్ డే మెసేజ్ రాయడంతో బాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ కు 100 కోట్లు, దీపికాకు 30 కోట్లు రెమ్యునరేషన్ గా ఇస్తున్నట్టు టాక్.                                                      



మరింత సమాచారం తెలుసుకోండి: