టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ను కరోనా టెన్షన్ ఇప్పట్లో వదిలేలా లేదు. షూట్ ఎంతలా స్టార్ట్ చేస్తున్నారో అంతే తొందరగా ప్యాకప్ లు చెప్పేస్తున్నారు. దీంతో ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలకు బడ్జెట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా టాప్ హీరోలు తమ పెండింగ్ ప్రాజెక్ట్ లను స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట.

టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ ఫిలింస్ షూటింగ్ లు ఎక్కడిక్కడ ఆగిపోతూ ఉన్నాయి. ఒకవేళ స్టార్ట్ అయినప్పటికీ ఎవరికో ఒకరికి కారోనా రావడంతో ప్యాకప్ లు పడిపోతున్నాయి. తాజాగా టక్ జగదీస్ విషయంలోను ఇదే జరిగింది. అలా స్టార్ట్ చేశారు. యూనిట్ లో ఒకరికి కరోనా సోకడంతో ఇలా ప్యాకప్ చెప్పేశారు.

తాజాగా విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా షూటింగ్ ఎప్పటినుంచో పెండింగ్ లో ఉంది. అందులో వెంకీ చేయాల్సిన కీలకమైన సన్నివేశాలు ఇంతకాలం షూట్ చేయకుండా లేట్ చేస్తూ వచ్చారు. నవంబర్ 5నుంచి జరిగే 5రోజుల షూట్ తో షెడ్యూల్  పూర్తికానుంది. ఈ షెడ్యూల్ కు  గడ్డం లుక్ తో వెంకీ జాయిన్ కాబోతున్నాడు. ఆ తర్వాత క్లీన్ షేవ్ తో చేయాల్సిన షూట్.. నవంబర్ మూడోవారంలో ఉంటుంది.

బోయపాటి, బాలయ్యల హ్యాట్రిక్ ఫిలిం కూడా ఇప్పటికే చాలా లేటయింది. ఈ ఫిలిం  స్టోరీ మ్యాటర్ లో రకరకాల రూమర్స్ వినిపించాయి. సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేశారని అందుకే సినిమా లేటవుతుందని ఎన్నో వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు బోయపాటి వీటిపై స్పందించింది లేదు. బట్ సెకండాఫ్ లో చేసిన మార్పులతో బోయపాటి హ్యాపీ ఫీలయ్యే తాజాగా షెడ్యూల్ కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. పైసా వసూల్ మూవీగా సినిమాను రూపుదిద్దుతున్నారు.

కరోనా ఎఫెక్ట్ తో చాలా  గ్యాప్ తర్వాత  త్వరలో షూట్ కు అటెండ్ కాబోతోన్న మరో టాప్ హీరో మెగస్టార్ చిరంజీవి. కొరటాల డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఆచార్య  ఫిలింతో చిరంజీవి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. సినిమా షూటింగ్ లేటవ్వచ్చేమో గాని కొరటాల కమర్శియల్ ఫార్ములా సినిమాను నిలబెడుతుందని మెగా
కాంపౌండ్  భావిస్తుంది. ఎంత లేటయినా  మేము లేటెస్ట్ గానే వస్తామనే మెసేజ్ ఇస్తు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: