ప్రిన్స్ మహేష్ బాబు క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే...బుల్లితెరపై వచ్చే అతని సినిమాల రేటింగ్ లు చెక్ చేసుకోవల్సిందే. శాటిలైట్ రైట్స్ రూపంలో పెట్టినదానికి నాలుగింతలు సంపాదించి పెట్టడంలో ప్రిన్స్ సినిమాలు ముందుంటాయి. తాజాగా మరోసారి ఈ విషయం ప్రూవ్ అయింది.

మహేష్ బాబు క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. అతడి సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడే  కాదు... ఆ తర్వాత బుల్లితెరపై రిలీజ్ అయినా... రికార్డులే రికార్డులు. టాలీవుడ్ టాప్ హీరోలెవరికి  సాధ్యం కానీ  రికార్డ్ లను ప్రిన్స్ ఇప్పటికే సాధించేశాడు. తాజాగా మరోసారి బుల్లితెర రికార్డ్ లను తిరగరాస్తున్నాడు. ఇందుకు సరిలేరు నీకెవ్వరు ఫిలింను రిఫరెన్స్ గా చూపిస్తున్నాడు.

మహేష్ సినిమాకు ముందునుంచి ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ ఎక్కువ. దాంతో బుల్లితెరపై వచ్చే ప్రిన్స్ ఫిలింస్ కు ఆదరణ పెరుగుతూ ఉంది. అప్పట్లో అతడు సినిమాను మా టీవి జస్ట్ 3.5కోట్లకు రైట్స్ దక్కించుకొని యాడ్స్ రూపంలో అంతకు నాలుగింతలు వసూళ్లు చేసినట్లు  చెబుతారు. మా టీవీలో అతడు ప్రసారం అయిన  ప్రతిసారి మహేష్ కున్న బుల్లితెర మార్కెట్ రేంజ్ ఏంటో అర్ధమయ్యేది.

తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా ... జెమినిటీవీలో  మూడోస్సారి  ప్రసారమై 12.55 రేటింగ్ తో సెన్పేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ కు ముందే జెమిని టీవి  14 కోట్లు వెచ్చించి మరీ దీని శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది.అయితే జెమినీలో ప్రసారమయ్యే టైమ్ కే అమెజాన్ ప్రైమ్ లో ఈ ఫిలిం రిలీజ్ అయిపోయింది.సోషల్ మీడియాలొను ఈసినిమా ఫుల్ పుటేజ్ ను అప్ లోడ్ చేశారు. దీంతో మెజారిటీ యూత్ సినిమాను చూసేశారు.

ఇంతలా ప్రేక్షకులు చూసినప్పటికీ సరిలేరు నీకెవ్వరు సినిమాను మొదటిగా ఉగాది కానుకగా మార్చి 25న సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ టైమ్ ప్రసారం చేశారు.ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 23.4 టిఆర్ పి రేటింగ్ వచ్చింది. ఇది బాహుబలి -2 కంటే రెండు పాయింట్లు ఎక్కువ. తాజాగా మూడోస్సారి ప్రసారం అయితే 12.55 రేటింగ్ రావడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. గడిచిన 15 ఏళ్లలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో టీఆర్పిలు వచ్చిన దాఖలాలు లేవు.దీంతో మహేష్ సినిమాలకు శాటిలైట్ ఛానల్లలో మాంచి రేటింగ్స్ వస్తాయని మరోసారి ప్రూవ్ అయింది.ఆయనగారి రేట్ కార్డూ పెరిగింది



మరింత సమాచారం తెలుసుకోండి: