ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... ఈ మధ్య మన హీరోస్ రీమేక్ కథలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి, రానాకీ ఈ మధ్య అంతకుముందు హిట్స్ ఏవి లేకపోవడంతో మళ్ళీ రీమేక్ నే నమ్ముకున్నారు.  మలయాళంలో విజయంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. ఆ సినిమా రైట్స్ దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ముందుగా నందమూరి బాలకృష్ణతో తెరకెక్కేందుకు ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత రవితేజ పేరు వినిపించింది. ఏమైందో గానీ రవితేజ నుండి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చింది ఈ రీమేక్. పవన్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించారు.

కానీ మధ్యలో కాస్త గ్యాప్ రావడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఎట్టకేలకు పవన్ తో ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం రానాను సంప్రదించగా.. దానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌ను డీల్ చేయగల సత్తా ఏ డైరెక్టర్‌కు ఉందోనని నిర్మాతలు జల్లెడ పట్టే సమయంలో.. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి . కానీ అది కూడా సెట్ కాక.. ఫైనల్ గా స్క్రిప్ట్ తయారీకి వర్క్ చేసిన సాగర్ నే డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు.


డైరెక్టర్, హీరోలు సెట్ అయిపోవడంతో ఇక సినిమా అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దసరాకు అధికారికంగా ప్రకటించే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ తో కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. అవి మరో రెండు రోజుల్లో పూర్తయిపోతే.. దసరాకు సినిమాను ప్రకటించేస్తారు. లేదంటే మరికొన్ని ఆలస్యమవుతుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. మంచి అవుట్ డోర్ లొకేషన్ లో ఒకట్రెండు సెట్ లు వేసి.. అక్కడే మొత్తం షూటింగ్ ను ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

 ఇలాంటి మరిన్ని వినోదాత్మకమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



మరింత సమాచారం తెలుసుకోండి: