తొలి సినిమా నుంచి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఓ స్థాయి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నారు శర్వానంద్.. అయన గత చిత్రాలు రాధా, మహానుభావుడు, పడిపడిలేచి మనసు, రణరంగం , జాను సినిమా లు దారుణంగా పరాయజం పాలవగా.. ప్రస్తుతం చేస్తున్న కీరవాణి, శ్రీకారం అనే చిత్రాపై మంచి హోప్స్ పెట్టుకున్నాడు.అయితే కరోనా కారణం గా అయన చేస్తున్న సినిమాలు నిలిచిపోయాయి..త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టుకోనున్నాయి..ఇటీవలే శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చింది.. rx100 సినిమా తో మంచి డైరెక్టర్ గా అజయ్ భూపతి పేరు తెచ్చుకున్నాడు.

అయితే ఈ సినిమ గతంలో పలువురు హీరో ల దగ్గరకు వెళ్లి చివరకి శర్వానంద్ దగ్గరికి వచ్చింది అన్న సంగతి అందరికి తెలుసు..  RX100 తర్వాత మహాసముద్రం అనే సినిమా ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా చాలామంది హీరో లు ఆ సినిమా ని రిజెక్ట్  చేశారు. మొదట ఈ కథ రవితేజ దగ్గరికెళ్లింది ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురిదగ్గరికెళ్ళి ఆ సినిమా కథ వెనక్కి వచ్చేసింది.. ఇప్పుడు అదే కథను శర్వానంద్ కి చెప్పి ఒప్పించాడు

ఇక శర్వానంద్ మరో సినిమా కి కూడా ఓకే చెప్పాడు.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ''ఆడాళ్లూ.. మీకు జోహార్లు'' అనే సినిమాలో శర్వా నటిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ముహూర్తం మరియు వేదిక ఖరారు చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 25న తిరుపతిలో 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమా వెంకటేష్ చేయాల్సింది కాగా కిషోర్ శర్వానంద్ తో చేయడం విశేషం.. ఈనేపథ్యంలో అసలే ఫ్లాప్ లలో ఉన్న శర్వా కి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ ఇస్తుందో చూడాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: