టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి న ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఎక్కడ ఉందో అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు.. దేశంలో ఏ  హీరో కి దక్కని స్టార్ డం ఇప్పుడు ప్రభాస్ సొంతం..ప్రస్తుతం మూడు సినిమా లు లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే..అందులో మొదటగా వచ్చే సినిమా రాధేశ్యామ్.. ఈ సినిమా ప్రస్తుతం ప్యారిస్ లో షూటింగ్ జరుపుకుంటుండగా సంక్రాంతి కి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ ప్రభాస్ చూస్తున్నాడు.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బయటకి వచ్చింది..

సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్ గా దీపికా పడుకునే ని ఖరారు చేయగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ రెడీ గా ఉంది.. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ కూడా నటిస్తున్నట్లు ఇటీవలే సినిమా టీం నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది..

‘బాహుబలి’తో ఒక్కసారిగా అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఆ సినిమా విజయంలో ప్రభాస్ ఘనతేమీ లేదని, అంతా రాజమౌళిదే క్రెడిట్ అని ప్రభాస్‌ను తేలిక చేసేవాళ్లూ లేకపోలేదు. కానీ ‘సాహో’ సినిమాకు కేవలం ప్రభాస్ పేరు మీదే వందల కోట్లు ఖర్చు పెట్టారు. అతడి పేరు మీదే బిజినెస్ జరిగింది. ఫ్లాప్ టాక్ వచ్చినా వందల కోట్లు వసూళ్లు రాబట్టింది. ఐతే అంతిమంగా ఈ సినిమా పరాజయం పాలైన నేపథ్యంలో ప్రభాస్ క్రేజ్ తగ్గి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ పుట్టిన రోజు నాడు ప్రభాస్ పేరు మార్మోగిన తీరు చూస్తే అతడిది చెక్కుచెదరని ఇమేజ్, క్రేజ్ అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: