అయితే హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ఈ సెలబ్రేషన్స్ లో కనిపించలేదు. సహజంగా హీరోహీరోయిన్లు ఇద్దరూ షూటింగ్ లో ఉంటే.. కామన్ గా కలసి కేక్ కట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ పూజా మిస్సైంది. ఇంతకీ పూజా హెగ్డే ఇటలీకి ఇంకా చేరుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్టిల్స్ లో పూజా ఎక్కడని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ పూజా లుక్ ని దాచేందుకే చిత్ర యూనిట్ ఆమె ఫొటోలను విడుదల చేయలేదని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద పూజా హెగ్డే మాత్రం ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో మిస్ అయినట్టు తెలుస్తోంది. ఇక డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో విడుదలైన ఈ పోస్టర్ రిచ్ లుక్ లో ఉందని నెటిజన్లు అంటున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ వింటేజ్ ప్రేమ కథకు రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఇటలీలో తిరిగి ప్రారంభమైంది.