దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేసాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించింది. దానితో ఇప్పుడు ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లొనే చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాదే శ్యామ్ సినిమా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత కూడా  ప్రభాస్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు.

 అందులో భాగంగా ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది.ఈ యాక్షన్ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా 2021 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు.ఇదిలా ఉంటె ఆదిపురుష్‌'లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్ సరసన సీత ఎవరనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో  ఆసక్తిని రేకెత్తిస్తుంది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో పౌరాణిక ఇతివృత్తంతో ఈసినిమాను రూపొందించబోతున్నారు.

 రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. అతడి సరసన నటించే నాయిక కోసం ప్రస్తుతం చిత్రబృందం వెతుకుతోంది. సీత పాత్ర కోసం కీర్తిసురేష్‌, కియారా అద్వాణీ,అనుష్కశర్మతో పాటు బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన అగ్రనాయికల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి ఎంపికచేస్తారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది..మరి ఈ హీరోయిన్లలో సీత గా నటించే అదృష్టం ఎవరికి వారిస్తుందో చూడాలంటే.. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: