రెబెల్ స్టార్ ప్రభాస్ ఇపుడు మంచి జోరు మీద ఉన్నాడు. ఆయన వరసపెట్టి చేస్తున్న మూడు ప్రాజెక్టులు వేటికవే సరిసాటిగా ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ ని కూడా తక్కువ చేయడానికి లేదు. ప్రభాస్ రాధేశ్యామ్  మీద గంపెడాశలు ఉన్నాయి. కూల్ లవ్ సబ్జెక్ట్ తో ప్రభాస్ చేస్తున్నా ఈ మూవీ వచ్చే వేసవిలో కూల్ కూల్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారు. పూజా హెగ్డే అందం, ప్రభాస్ రాజసం కలగలిపి ఈ మూవీని ఎక్కడికో తీసుకుపోయాయి. అంచనాలు కూడా అంబరాన్ని తాకాయి. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ మోషన్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మూవీ తరువాత ప్రభాస్ నెక్స్ట్ చేసే మూవీ కూడా తెలిసిపోయింది. ఆయన తెలుగు నిర్మాత. ప్రముఖ బ్యానర్ అధినేత అశ్వనీదత్ కే ఓటు వేశారని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ గా అశ్వనీదత్ నాగ్ అశ్విన్ డైర్క్షన్లో తీసుకువస్తున్న భారీ బడ్జెట్ మూవీకి ప్రభాస్ వెంటనే షిఫ్ట్ అవుతారు అంటున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రారంభించి శరవేగంగా పూర్తి చేసి 2021లో  ప్రభాస్ బర్త్ డే వేళకు అంటే అక్టోబర్ 23న రిలీజ్ చేయడానికి అపుడే ప్లాన్ వేశారని అంటున్నారు.

అంటే ఇంకా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకాలేదు కానీ రిలీజ్ డేట్ ఇవ్వడం అంటే నిజంగా గ్రేట్ అనుకోవాలి. అంటే తెర వెనక నాగ్ అశ్విన్ చేస్తున్న అతి పెద్ద కసరత్తు వల్లనే ఇలా చెప్పగలుగుతున్నారని కూడా అంటున్నారు. ఈ మూవీ విషయంలో అన్ని రకాలైన సాధనాలు సమకూర్చుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ ఎపుడు డేట్స్ ఇస్తే అపుడు స్టార్ట్ అనేట్లుగా ఉన్నారట. అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఆయన ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి చెప్పగలుతున్నారు అంటున్నారు. మొత్తానికి ఆదిపురుష్ మాత్రం 2022లోనే అని అంతా అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి శుభవార్త ఏంటి అంటే 2021లో రెండు మూవీస్ ప్రభాస్ వి రిలీజ్ అవుతున్నాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: