రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ వస్తోంది. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో.. వచ్చే ఏడాదికి సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమాతో కేజీఎఫ్ చాప్టర్ 2 కి విపరీతమైన పోటీ ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 1 తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు పార్ట్ 2తో మరింత అలజడి సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదే  ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ -2 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా కరోనా లాక్ డౌన్ వల్ల రెండు సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. టీజర్ల విడుదలలలో మాత్రం ఆర్ఆర్ఆర్ కాస్త ముందున్నా.. సినిమా విషయంలో మాత్రం కేజీఎఫ్ ముందుగా థియేటర్స్ లోకి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. గతంలో కోలార్ బంగారు గనుల దగ్గర షూటింగ్ విషయంలో అడ్డంకులు ఎదురవడంతో సినమా షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత ప్రత్యేక సెట్టింగ్ లు వేసి సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.
రెండు సినిమాల షూటింగ్ లు ఎక్కువరోజులు జరగడానికి కారణం ఎక్కువమంది ఆర్టిస్ట్ లు ఉండటమే. అటు ఆర్ఆర్ఆర్ లో కూడా హిందీ నటులు కనిపిస్తారు. ఇటు కేజీఎఫ్ లో కూడా హిందీతోపాటు.. ఇతర భాషా నటీనటులు కనిపిస్తారు. వీరందరిని సమన్వయం చేసుకుంటూ సినిమాలు పూర్తి చేస్తున్నారు దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్. టీజర్లతో సందడి సృష్టించిన దర్శకుడు రాజమౌళి ఒకరకంగా ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో అటు హీరో యశ్ కూడా త్వరగా టీజర్ బైటకు వదలాలని దర్శకుడు ప్రశాంత్ పై ప్రెజర్ పెడుతున్నాడట. ఈ నేపథ్యంలో త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ వస్తుందని అనుకుంటున్నారు. ఒకవేళ ఆ టీజర్ వస్తే.. అప్పుడు ఆర్ఆర్ఆర్ తో కంపేరిజన్ మరింత పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: