అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో స్టార్ హీరోలు, దర్శకులు షూటింగ్ బాట పట్టారు. అలనాటి హీరో కం విలన్ పాత్రలను అవలీలగా పరకాయ ప్రవేశం చేసిన స్టార్ నటుడు మోహన్ బాబు కూడా సినిమా షూటింగ్ పనులు ప్రారంభించారు.  24 ఫ్రేమ్స్, లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు దేశభక్తి చిత్రమైన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రచయితగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సినిమాకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన టైటిల్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని హైదరాబాద్ లోని మోహన్ బాబు నివాసంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇక అరియానా మంచు - వివియానా మంచు స్క్రిప్ట్ ను డైరెక్షన్ టీమ్ కి అందజేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. అయితే తెలుగులో ఇంతకముందు చూడని స్టోరీలైన్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మంచు మోహన్ బాబు ఇంతకు ముందెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రను ఇందులో పోషిస్తున్నారు.'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి మాస్ట్రో ఇలయరాజా సంగీతం సమకూర్చనున్నారు.

సర్వేష్ మురారి ఛాయాగ్రాహకుడుగా వ్యవహరించనున్నారు. డైమండ్ రత్నాబాబు - తోటపల్లి సైనాథ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి డాక్టర్ మోహన్ బాబు స్క్రీన్ ప్లే కూడా అందిస్తుండటం విశేషం. ఇక గతంలో ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మంచు మోహన్ బాబు మరోసారి ఈ చిత్రంతో దేశభక్తిని చాటిచెప్పబోతున్నారు. మిగతా నటీ నటుల వివరాలు తెలియాల్సి ఉంది. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ లలో ఎక్కువగా నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: