టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన క్రిష్ తన డైరక్షన్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. క్రిష్ డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే. అంతేకాదు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడంలో క్రిష్ ముందుంటాడు. తన మార్క్ సినిమాలతో అలరిస్తున్న క్రిష్ లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. కొండపొలం నవల ఆధారంగా క్రిష్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను కరోనా లాక్ డౌన్ టైం లోనే మొదలుపెట్టి రీసెంట్ గా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చినప్పుడు మొదలుపెట్టి చకచకా సినిమా పూర్తి చేశాడు క్రిష్. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలాంటి టైం లో షూటింగ్ పూర్తి చేసి శభాష్ అనిపించాడు.

వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కు రెడీగా ఉంది. ఓటిటి ఆఫర్స్ వచ్చినా సరే థియేటర్ రిలీజ్ కోసం ఇది వెయిట్ చేస్తుంది. తక్కువ టైం లో అనుకున్న విధంగా సినిమా తీయడంలో క్రిష్ తన టాలెంట్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా కరోనా టైం లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చేయడం అనేది మాములు విషయం కాదు. మరి ఇలాంటి టైం లో షూటింగ్ పూర్తి చేసిన క్రిష్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని తెలుస్తుంది. మరి క్రిష్ కొండపొలం నవల కథతో వచ్చే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.                                                                     
 

మరింత సమాచారం తెలుసుకోండి: