ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తమ బ్యానర్ లోనే సినిమా ఉంటుందని అప్పట్లో అల్లు అరవింద్ ఖైదీ నంబర్ 150 సక్సెస్ మీట్ లో పాల్గొని మరీ చెప్పారు. బోయపాటితో స్క్రిప్టు రెడీ అయ్యింది. ఇక సెట్స్ కెళ్లడమేనని ఆయన అప్పట్లో అన్నారు. ఆ తర్వాత కూడా బోయపాటితో సినిమా చేసేందుకు చిరు సుముఖత వ్యక్తం చేశారని ప్రచారమైంది. కానీ వినయ విధేయ రామ దెబ్బకి మళ్లీ ఆ ఊసే లేదు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి`ని రామ్ చరణ్ నిర్మించారు. ఇక ప్రస్తుతం కొరటాలతో ఆచార్య (చిరు 152) చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

ఆ తర్వాత కూడా వేదాలం రీమేక్ కోసం మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు చిరు కాల్షీట్లు ఇచ్చేశారు. ఇది కాక లూసిఫర్ రీమేక్ కూడా రెడీగా ఉంది. అది కాక బాబీ చెప్పిన మరో మల్టీ స్టారర్ కూడా సిద్దమే. ఈ సమయంలో మళ్ళీ ఇప్పుడు బోయపాటితో చిరు సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ సినిమాతో బిజీగా ఉన్నారు. గతంలో బాలయ్యతో సూపర్ హిట్ ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు తీయడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా పూర్తి అయ్యాక చిరుతో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిన్ దిల్ రాజు నిర్మించే అవకశం ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రకటన ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు.. పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి చిరు - బోయపాటి - దిల్ రాజు కాంబినేషన్ అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: