కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో ఇప్పటికే సూపర్ ఫాంలో ఉంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ హిట్ తో సూపర్ ఫాం కొనసాగిస్తున్న అమ్మడు తెలుగులో స్టార్ సినిమా అంటే మాత్రం అమ్మడు ముందు వరసలో ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబోలో వస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాల తర్వాత శర్వానంద్ తో కూడా రష్మిక జోడీ కడుతుందని తెలుస్తుంది. కిశోర్ తిరుమల డైరక్షన్ శర్వానంద్ చేస్తున్న ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమాలో రష్మికను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు టాక్. సినిమా దసరా సందర్భంగా స్టార్ట్ అవుతుంది. స్టార్ హీరోలతో పాటుగా యువ హీరోల సరసన కూడా రష్మిక ఛాన్సులు అందుకుంటుంది.

స్టార్స్ తో నటిస్తూనే యంగ్ హీరోల ఛాన్సులు కాదని చెప్పకుండా అమ్మడు వాటిని వీటిని కవర్ చేస్తుంది. తప్పకుండా రష్మిక క్రేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. తెలుగులో పూజా హెగ్దేతో పాటుగా రష్మిక కూడా సూపర్ ఫాం లో ఉంది. ఈ ఇద్దరే ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్నారని చెప్పొచ్చు. రష్మిక తన అభినయంతో ప్రేక్షకులను అలరిస్తుంది.                                                                                               


మరింత సమాచారం తెలుసుకోండి: