ఇక ఈ సినిమాతో పాటుగా నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రబ్ణాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అశ్వనిదత్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను కూడా ఫ్యాన్స్ కోరుకునే అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ప్రభాస్ తో సినిమాపై ఆయన ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే వారి కోసం ఎన్ని సినిమాలు వచ్చినా తను తీసే సినిమా అంతకుమించి అనిపించేలా ఉంటుందని చెబుతున్నాడు. మహానటి సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చూపిన నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. అందుకు తగ్గ వర్క్ కూడా బాగా చేస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా ప్రభాస్ నాగ్ అశ్విన్ ఏదో బ్రహ్మాండమే సృష్టించేలా ఉన్నారని ఫిక్స్ అవ్వొచ్చు. ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తుండటం మరో గొప్ప విషయమని చెప్పొచ్చు.