ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చూస్తే అదే అనిపించక మానదు.మెగాఫ్యాన్స్ అంతా ఆత్రుతగా వెయిట్ చేస్తోన్న భారీ సినిమాలో చరణ్ సరసన ఆఫర్ కొట్టేసింది. ఇప్పటికే ఈ ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఇప్పుడు మెగా హీరో అల్లు అర్జున్ సరసన పుష్ప చేస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ కాకముందే మరో మెగా మూవీలో ఆఫర్ అందుకుంది రష్మిక మందన్న. ఆచార్యలో చరణ్ సరసన ఈమె హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం మీద అధికారిక ప్రకటన అయితే రాలేదు అనుకోండి. అది కాక సమంతా పూజా కోల్డ్ వార్ వలన సమంతా పూజాకు దక్కాల్సిన ప్రాజెక్ట్ లను కూడా ఈమెకు దక్కేలా ప్రభావితం చేస్తోందని కూడా అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తోంటే రష్మిక స్టార్ హీరోయిన్ హోదాకు దగ్గరవుతున్నట్లే కనిపిస్తోంది కదూ. అందుకే ఆమె ఎక్కడో నక్కతోక తొక్కి వచ్చినట్టు ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు.