సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇందులో ఎప్పుడు ? ఎవరు ? ఎందుకు ? ఎలా ? క్లిక్ అవుతారో ! దేవుడు తప్ప ఎవరూ చెప్పలేం. అలా చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పుడు టాలీవుడ్ టాప్ చైర్ కు దగ్గరవుతోంది. పరిచయం కావడం చిన్న సినిమాతో, చిన్న హీరోతోనే పరిచయం అయినా, ఈ అమ్మడు ఎక్కడో నక్కతోక తొక్కి వచ్చినట్టు ఉంది. అందుకే వరుసగా స్టార్ హీరోస్ సరసన సినిమాలు అందుకుంటూ నెంబర్ వన్ స్థానానికి వెళ్తోంది.

 ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చూస్తే అదే అనిపించక మానదు.మెగాఫ్యాన్స్ అంతా ఆత్రుతగా  వెయిట్ చేస్తోన్న భారీ సినిమాలో చరణ్ సరసన ఆఫర్ కొట్టేసింది. ఇప్పటికే ఈ ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఇప్పుడు మెగా హీరో అల్లు అర్జున్ సరసన పుష్ప చేస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ కాకముందే మరో మెగా మూవీలో ఆఫర్ అందుకుంది రష్మిక మందన్న. ఆచార్యలో చరణ్ సరసన ఈమె హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం మీద అధికారిక ప్రకటన అయితే రాలేదు అనుకోండి. అది కాక సమంతా పూజా కోల్డ్ వార్ వలన సమంతా పూజాకు దక్కాల్సిన ప్రాజెక్ట్ లను కూడా ఈమెకు దక్కేలా ప్రభావితం చేస్తోందని కూడా అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తోంటే రష్మిక స్టార్ హీరోయిన్ హోదాకు దగ్గరవుతున్నట్లే కనిపిస్తోంది కదూ. అందుకే ఆమె ఎక్కడో నక్కతోక తొక్కి వచ్చినట్టు ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: