సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో అమెరికాలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న సినిమా సర్కారు వారి పాట. కాగా ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా తొలిసారిగా కీర్తి సురేష్ నటిస్తుండగా దీనిని యువ దర్శకుడు తన పెట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించనున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమా పై సూపర్ స్టార్ ఫాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. బ్యాంకు మోసాలు, కుంభకోణాల నేపథ్యంలో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని మంచి జోష్ మీద ఉన్న సూపర్ స్టార్ ఎలాగైనా ఈ సర్కారు వారి పాటు తో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.  

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం , ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు తండ్రిగా సీనియర్ యాక్టర్ మురళీమోహన్ నటించనున్నారని ఇప్పటికే ఆయన్ని యూనిట్ ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. గతంలో మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ సినిమాలో మహేష్ కు తండ్రిగా మురళీమోహన్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం మురళీమోహన్ మహేష్ తండ్రిగా ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనేది తెలియాలంటే దీనిపై సర్కారు వారి పాట యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: