మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు నిన్న ప్రభాస్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ లకు ప్రేక్షకాభిమానుల నుండి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటలీలో జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా నిన్న ప్రభాస్ జన్మదిన వేడుకలు అక్కడే యూనిట్ సభ్యుల సమక్షంలో ఎంతో గ్రాండ్ లెవల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఆయన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు అలానే కేక్ కటింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా నిన్నటి నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మన బాహుబలికి పలువురు సినిమా ప్రముఖులు తో పాటు ఎందరో అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు అందించిన విషయం తెలిసిందే. కాగా రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!