టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీలో సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా ప్రభాస్ తల్లిగా ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు నిన్న రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ ఫ్యాన్స్ నుండి మంచి స్పందన రాబట్టాయి. ఇకపోతే ఈ సినిమాలో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ఇటీవల ఒక మీడియా చానల్ ఇంటర్వ్యూ లో భాగంగా నటి పూజా హెగ్డే మాట్లాడుతూ ప్రభాస్ పై కొంత షాకింగ్ కామెంట్స్ చేసారు. తాను ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎందరో అగ్ర నటులు సరసన హీరోయిన్ గా నటించానని, అయితే వారందరిలో తనకు ప్రభాస్ ఎంతో నచ్చారని పూజా చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆయన నడుచుకునే వ్యవహారశైలి అలానే ఇతరులపట్ల ఆయన వ్యవహరించే తీరు పద్ధతి, అణకువ మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరితో ఆయన కలుపుగోలుతనం, సరదాగా కలిసిపోవడం వంటివి తనకు ఎంతో బాగా నచ్చిందని ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి మాట బహుశా ప్రభాస్ వంటి వారిని చూశాకే పుట్టిందేమో అని తనకు అనిపంచిందని అన్నారట పూజా హెగ్డే. కాగా పూజ, ప్రభాస్ ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా దీనిని వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: