పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ సినిమా ప్రీ లుక్ అదిరిపోయింది. పి.ఎస్.పి.కె 27 ప్రీ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచింది. క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాలో పవన్ కెరియర్ లో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు 15 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ డిసెంబర్ లో మొదలవుతుందని తెలుస్తుంది.  

ఇక ఈ సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా స్టార్త్ చేశాడు. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ఈమధ్యనే మొదలు పెట్టి ఒక పాట మినహా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను అనుకున్న టైం లో పూర్తి చేసి పవర్ స్టార్ కు ఫుల్ కాన్ ఫిడెన్స్ ఇచ్చాడు క్రిష్.

పవర్ స్టార్ అసలకే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడు. అందుకే క్రిష్ లాంటి డైరక్టర్ తో సినిమా అంటే తప్పకుండా సినిమా అనుకున్న టైం కు ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది. వైష్ణవ్ తేజ్ సినిమా కరోనా టైం లోనే పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నాడు క్రిష్. మరి ఈ సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా 70 రోజుల్లోనే పూర్తి చేసి సత్తా చాటాడు. మరి పవన్ సినిమాను ఎన్నిరోజుల్లో పూర్తి చేస్తాడో చూడాలి.                                

మరింత సమాచారం తెలుసుకోండి: